తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ఐదుగురు హిజ్రాలు ఓ వ్యక్తిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఈ వ్యక్తి తిరగబడడంతో.. దారుణంగా కొట్టి చంపేశారు. పుదుకొటయ్ జిల్లాలో ధర్మలింగం అనే వ్యక్తి వంటమాస్టర్గా పని చేస్తున్నాడు. అయితే రాత్రి సినిమాకి పోయి ఇంటికి తిరిగి వెళుతున్నాడు. అదే సమయంలో ఐదుగురు హిజ్రాలు మద్యం మత్తులో ఆ యువకుడిని బలవంతంగా తీసుకెళ్ళారు.
అతనిపై లైంగిక దాడికి యత్నించారు. అయితే ఆ యువకుడు తిరగబడడంతో… కోపంతో ఊగిపోయిన హిజ్రాలు.. అతనిని కొట్టి చంపేశారు. అతని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిజ్రాలే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. రష్మిక, అరుణిక, గౌతమి, రూబీ, మమత అనే ఈ ఐదుగురు హిజ్రాలు ఈ దారుణానికి తెగబడ్డారు.